బాలీవుడ్ హీరోలకి పొంచిఉన్న ముప్పు!

Share
 
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' తో తన స్టామినా ఏమిటో ,తెలుగు సినిమా స్టామినా ఏమిటో మొత్తం ఇండియా కు తెలియజేసారు. ఇప్పడు బాలీవుడ్ లో కి అడుగుపెట్టబోతున్నారు. శ్రీ వరసిద్ది వినాయకా ప్రొడక్షన్ ప్రై. లిమిటెడ్ పతాకం పై కొండా కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ లో హిందీ, తెలుగు భాష లలో ప్రారంభం కానున్నది .
ఈ సినిమా గురించి కొండ కృష్ణంరాజు మాట్లాడుతూ ఎందోరో హిందీ, తెలుగు నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారితో హిందీ  సినిమా నిర్మించాలని ప్రయత్నించారు. కాని పవన్ గారి మొదటి హిందీ సినిమాను నిర్మించే అవకాశం నాకు రావడం అదృష్టం గా బావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని అభిమానులు, ప్రేక్షకులు ఏ విధంగా చూడాలని అనుకుంటారో అదే విధంగా ఉండే కధ తో పూర్తి ఎంటర్ టైన్మెంట్  ఈ చిత్రం ఉంటుందని, ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తానన్నారు.

0 comments:

Post a Comment